అభిషేక్ శర్మ కంటే ముందు మరో ముగ్గురు భారత ఆటగాళ్లు సైతం టీ20ల్లో అరంగేట్ర మ్యాచులోనే డకౌట్ అయ్యారు. తొలుత టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. 2016లో జింబాబ్వేతో మ్యాచులో కేఎల్ రాహుల్, 2021లో శ్రీలంకతో మ్యాచులో పృథ్విషాలు సైతం ఇలాగే డకౌట్ అయ్యారు. అయితే రాహుల్, పృథ్విషాలు తాము ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్ కావడం గమనార్హం.
కాగా ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున అభిషేక్ శర్మ అదరగొట్టాడు. ట్రావిస్ హెడ్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తూ పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలోనే రికార్డులు బద్దలు కొట్టాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్ 2024లో 16 మ్యాచులు ఆడిన అభిషేక్ శర్మ.. 200 లకు పైగా స్ట్రైక్ రేటుతో 484రన్స్ స్కోరు చేశాడు. ఒక సీజన్లో అతడు నమోదు చేసిన అత్యధిక రన్స్ ఇవే కావడం గమనార్హం.
కాగా 2018 ఎడిషన్ ద్వారా అభిషేక్ ఐపీఎల్లో డెబ్యూ చేశాడు. ఢిల్లీ డేర్డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున తొలి సీజన్ ఆడాడు. కానీ ఆ సీజన్లో 3 మ్యాచులు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. అన్ని సీజన్లతో పోలిస్తే 2024 ఎడిషన్లో పరుగుల వరద పారించాడు. దీంతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి జట్టులో చోటు సంపాదించాడు. అయితే తొలి మ్యాచులో విఫలమైనప్పటికీ అతడికి రెండో టీ20 మ్యాచు కోసం తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అందివచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా రెండో టీ20 మ్యాచ్ ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు జరగనుంది.
Ananya Das is your guide to the latest trends, viral sensations, and internet phenomena. Based on a keen understanding of digital culture, Sophie navigates the ever-evolving landscape of trending topics. With an insightful and engaging approach, she explores what’s buzzing across social media platforms, ensuring readers stay in the loop with the most talked-about and shareable content online.